Friday, March 29, 2024
- Advertisement -

భారత్ ప్రైమ్ మినిస్టర్ సోనూసూద్‌.. సోను సూద్ రియాక్షన్…!

- Advertisement -

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు.కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది కార్మికులకు అండగా నిలిచి వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌ భారత్లో విలయతాండవం చేస్తోంది.దానికి తోడు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.ఆక్సిజన్ కోసం పడుతున్న కష్టాలను తీర్చేందుకు సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇందులో బాగంగ కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనీ ముందుకొచ్చాడు.ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపాడు.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

ప్రస్తుతం సోనూసూద్ అభిమానులు అతని మార్గంలోనే నడుస్తూ తోటి వారికి దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు అభిమానులైతే అతన్ని దేశానికి ప్రధానిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.సోనూ దేశానికి ప్రధాని అయితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని వాళ్ల భావన. అయితే ఈ వ్యాఖ్యలపై సోనూ రీసెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. తనకు సామాన్యుడిలా జీవించడమే ఇష్టమని తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.అలాగే ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా మా వంతుగా కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం అని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.

Also read:ప్రశాంతత కోసం ఆ పని చేయండంటున్న బాలీవుడ్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -