పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో చిత్రం అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. టైటిల్, పోస్టర్ విడుదలవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కరణ్జోహార్, పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీపై ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం లైగర్ మూవీని రూ. 200 కోట్లు చెల్లించి తీసుకొనేందుకు ఓ ఓటీటీ సంస్థ ముందుకొచ్చిందట.. అయితే అందుకు చిత్ర నిర్మాతలు, పూరీ ఒప్పుకోలేదని సమాచారం. ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశాడు. ‘ లైగర్ రూ. 200 కోట్లకు ఓ ఓటీటీ సంస్థ అడిగింది నిజమే. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే నేను ఇంతకంటే ఎక్కువే కలెక్ట్ చేస్తాను’ అంటూ విజయ్ ట్వీట్ పెట్టారు. దీంతో లైగర్ మూవీకి ఏ రేంజ్లో మార్కెట్ ఉందో అర్థమవుతుంది.
ఈ సినిమా బాగా రావడంతోనే చిత్ర బృందం అంత కాన్ఫిడెంట్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. లైగర్ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల షూటింగ్ డిలే అయ్యింది. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ తొందర్లోనే హైదరాబాద్ లో మొదలు కానున్నట్లు టాక్. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు అంగీకారం తెలిపాడు.
Also Read