Saturday, April 20, 2024
- Advertisement -

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

- Advertisement -

పూరి జగన్నాథ్​.. విజయ్​ దేవరకొండ కాంబినేషన్​లో చిత్రం అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. టైటిల్​, పోస్టర్​ విడుదలవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కరణ్​జోహార్​, పూరి జగన్నాథ్​, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీపై ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం లైగర్​ మూవీని రూ. 200 కోట్లు చెల్లించి తీసుకొనేందుకు ఓ ఓటీటీ సంస్థ ముందుకొచ్చిందట.. అయితే అందుకు చిత్ర నిర్మాతలు, పూరీ ఒప్పుకోలేదని సమాచారం. ఈ విషయంపై విజయ్​ దేవరకొండ ఓ ట్వీట్​ చేశాడు. ‘ లైగర్​ రూ. 200 కోట్లకు ఓ ఓటీటీ సంస్థ అడిగింది నిజమే. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే నేను ఇంతకంటే ఎక్కువే కలెక్ట్ చేస్తాను’ అంటూ విజయ్​ ట్వీట్​ పెట్టారు. దీంతో లైగర్​ మూవీకి ఏ రేంజ్​లో మార్కెట్ ఉందో అర్థమవుతుంది.

ఈ సినిమా బాగా రావడంతోనే చిత్ర బృందం అంత కాన్ఫిడెంట్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. లైగర్ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల షూటింగ్ డిలే అయ్యింది. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ తొందర్లోనే హైదరాబాద్ లో మొదలు కానున్నట్లు టాక్. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు అంగీకారం తెలిపాడు.

Also Read

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -