వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోలతో పోటీ పడిగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది తమన్నా. ఓ వైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు ఐటం సాంగ్స్ చేయడానికి వెనుకాడటం లేదు. ఇక తాజాగా మరో వైవిధ్యమైన పాత్రతో ముందుకురానుంది తమన్నా.
టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది కథ అందించగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓదెల రైల్వే స్టేషన్. అశోక్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.
సీక్వెల్ని గ్రాండ్గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేయగా తమన్నాని మెయిన్ లీడ్ కి ఎంపిక చేశారు. ఇక ఇవాళ శివరాత్రి సందర్భంగా తమన్నా లుక్ని రిలీజ్ చేశారు. తన కెరీర్లో తొలిసారి అఘోర పాత్ర చేస్తోంది తమన్నా. కాషాయ దుస్తుల్లో తమన్నా ఆధ్యాత్మికంగా కనిపించగా చేతిలో ఢమరుకం, నుదుటిన విబూది, మరో చేతిలో కర్రతో శివశక్తి రూపంలో లుక్ అదుర్స్ అనేలా ఉంది. ఈ సీక్వెల్కు సంపత్ నంది కథ అందిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది.