Saturday, May 4, 2024
- Advertisement -

మెగా, నంద‌మూరి కుటుంబం మ‌ధ్య పోరు

- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో విల‌న్‌గా తార‌క‌ర‌త్న‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో రెండు ముఖ్య‌మైన కుటుంబాలు ఉన్నాయి. ఒక‌టి మెగా కుటుంబం కాగా రెండోది నంద‌మూరి కుటుంబం. ఈ రెండు కుటుంబాల మ‌ధ్య సినిమాల ప‌రంగా రాజ‌కీయప‌రంగా ప‌డ‌దు. అలాంటిది ఈ రెండు కుటుంబాలు క‌ల‌వ‌నున్నాయి. ఈ రెండు కుటుంబాల‌కు చెందిన న‌టులు ఓ సినిమాలో న‌టించ‌నున్నార‌ట‌.

ప్ర‌స్తుతం రామ్ చరణ్‌తేజ్‌ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్నాడు. దీని తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌పై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దృష్టి ప‌డింది. ప్రేక్ష‌కుల్లో కూడా అంచ‌నాలు బాగా పెరిగాయి. ఇక బోయపాటి శ్రీనివాస్ సినిమా అంటే హీరోలు ఓ వంద మందిని కుమ్మాల్సిందే. యాక్షన్ ఎపిసోడ్స్ సూప‌ర్‌గా ఉంటాయి. రామ్‌చరణ్ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో తారకరత్నను తీసుకుంటార‌ని స‌మాచారం. ఈ నిర్ణ‌య‌మే ఆశ‌ర్య‌ప‌ర‌చేది. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే అభిమానుల‌కు పండ‌గే.

గతంలో తారకరత్న, అమరావతి, రాజా చేయి వేస్తే సినిమాల్లో విలన్‌గా నటించాడు. అయినా అవేవి తార‌క‌ర‌త్న కెరీర్‌కు ల‌బ్ధి చేకూర్చ‌లేదు. విల‌న్ల‌ను కొత్త‌గా బోయ‌పాటి చూపిస్తాడు. న‌టుల‌ను విల‌న్‌గా బాగా చూపిస్తారు. ఇప్పుడు తార‌క‌ర‌త్న భ‌విష్య‌త్ బోయపాటి చేతిపై ఆధార‌ప‌డింది. గ‌తంలో జగపతిబాబుని భారీ విలన్‌గా చూపించి అత‌డి కెరీర్‌కు మంచి ప్రారంభం ఇచ్చారు. ఈ సినిమా జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రీ ప్రొడక్షన్స్ ప‌నుల్లో భాగంగా నటీనటుల ఎంపిక చేప‌డుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -