ఏ హీరోయన్ అయినా ఒక్క హిట్ పడిందంటే చాలు… రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంది. ఇంకా వెనుక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు.తెలుగులో ప్రస్తుతం హీరోయిన్స్ తీసుకుంటున్న వివరాలు ఇలా ఉన్నాయి.పూజా హెగ్డే రూటే వేరు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ అమ్మడు మూడు సినిమాలు చేసింది. పూజా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు.తన నాలుగవ సినిమాకు పూజా ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట.అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాక్ష్యం’ మూవీలో పూజా నటిస్తోంది.
మరోవైపు ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ. 85 లక్షలు, సాయి పల్లవి రూ. 85 లక్షలు, నివేదా థామస్ రూ. 70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ. 60 లక్షలు, అను ఇమ్మాన్యుయేల్ రూ. 50 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ. 70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ? ఇవ్వన్ని మనకు అందిన సమాచరం మేరకే మనకి అందని లెక్కలు ఎన్ని ఉన్నాయో.