Sunday, April 28, 2024
- Advertisement -

రెమ్యూనరేషన్ విషయంలో ఆ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపిన శర్వానంద్?

- Advertisement -

సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, తన సినిమాలు తనపనినీ చూసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ తాజాగా ఓ వివాదంలోకి దిగారని తెలుస్తోంది.హీరో శర్వానంద్ తాజాగా నటించిన శ్రీకారం సినిమా థియేటర్లలో విడుదలయినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయింది.

శ్రీకారం సినిమాను నిర్మించిన 14 రీల్స్ నిర్మాత శర్వానంద్ రెమ్యూనరేషన్ కొంత భాగం చెల్లించి మరి కొంత భాగం సినిమా విడుదలైన తర్వాత ఇస్తానని, సినిమా విడుదలై ఆశించిన ఫలితాలు లేకపోవడంతో శర్వానంద్ రెమ్యూనరేషన్ పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది.

Also read:రొమాంటిక్ మూడ్ లో హైపర్ ఆది..ఏకంగా హగ్గులతో రచ్చ!

తన రెమ్యునరేషన్ విషయం గురించి శర్వానంద్ పలుమార్లు నిర్మాతలకు చెప్పిన వారు పట్టించుకోని నేపథ్యంలో హీరోగారు వారికి లీగ‌ల్ నోటీసులు పంపార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే సంగతి మాత్రం హీరో శర్వానంద్ లేదా నిర్మాతలు స్పందించి క్లారిటీగా చెప్పాల్సి ఉంది. ఇకపోతే శర్వానంద్, హీరో సిద్ధార్థ్ కలిసి మహాసముద్రం సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -