Friday, April 19, 2024
- Advertisement -

M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

- Advertisement -

తెలుగు బుల్లి తెరపై విశేష ప్రజాదరణ పొందిన షో లలో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. జబర్దస్త్ కోట్లాది ప్రజల హృదయాల తాకి వారి ఆదరణ పొందుతోంది. అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రామ్ కే దక్కుతుంది. జబర్దస్త్ వేదిక ద్వారా నవ్వులు పంచుతున్న కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకరు. సాధారణ టీమ్ మెంబర్ గా ఉన్న కార్తీక్ ప్రస్తుతం టీమ్ లీడర్ స్థాయికి చేరి తన అద్భుతమైన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

జబర్దస్త్ వేదికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవ్వుకార్తిక్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలు,కుటుంబ పరిస్థితులు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు.స్వతహాగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ను. మొదటిసారి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ షో చేస్తే 200 రూపాయలు ఇచ్చారట. ఇది తన మొదటి సంపాదనగా చెప్పుకొచ్చాడు.

Also read:అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

ఇక తన కుటుంబ విషయానికొస్తే నాన్న ఆర్టీసీ కండక్టర్ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే జాబు వదిలేశాడు. అమ్మ ఇంట్లోనే మిషన్ కుట్టి కుటుంబ అవసరాలను తీర్చేది. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. నేను ఇంటర్ చదివే టైంలో హాస్టల్‌లో ఉండేవాడ్ని. రెండే రెండు జతల బట్టలతో కాలేజీ జీవితం గడిచింది. నాన్న అప్పులు తీర్చడం కోసం ఉన్న ఒక్క ఇంటిని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ధనరాజ్ అన్న టీంలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఈ షో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంటూ తాను పడిన కష్టాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Also read:బాలయ్య బాబు ఏ బ్రాండ్ మందు తాగుతాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -