Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్ సినిమా టైటిల్ పై దృష్టి పెట్టిన త్రివిక్రమ్!

- Advertisement -

దాదాపుగా 13 ఏళ్ల తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‍లో హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న సినిమా #SSMB28. త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న ఈ మూడో సినిమా పై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డే, రెండో కథానాయికగా శ్రీలీల అలరించనున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు టాక్. వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్దమౌతున్న.. సినిమా టైటిల్ కోసం నాలుగు టైటిల్స్ ను పరిశీలించినట్టు.. వాటిలో రెండు టైటిల్స్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపింస్తున్నట్టు సమాచారం. ఒకటి ‘అయోధ్యలో అర్జునుడు’ కాగా మరోక్కట్టి ‘గుంటూరు కారం’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట.

అయితే, ఈ కథ అంతా కూడా గుంటూరు నేపథ్యంగా నడుస్తుండంతో ‘గుంటూరు కారం’ టైటిల్ కరెక్ట్ అనే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇది ఒక సినిమా టైటిల్ లా అనిపించడం లేదనే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. అయితే త్రివిక్రమ్ తన సినిమాలకు ’అ’ సెంటిమెంట్ ఉండడంతో ’అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ టైటిల్ అయితే ఆలోచింపజేసేదిగా .. ఆసక్తిని రేకెత్తించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపున ‘గుంటూరు కారం’ ఖరారైపోయిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది.

Also Read: ఉదయ్ కిరణ్ మరణంపై దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -