ఏడాది కాలంగా బుల్లితెరకు.. చాలా దూరంగా ఉంది ఉదయభాను. ఇప్పుడు ఈ భామ మళ్లీ కమ్ బ్యాక్ అంటోంది. ఇద్దరు పిల్లలకు తల్లైన ఈమె.. ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. ట్విన్స్ కావడం వల్ల.. ఉదయబాను వారిని చూసూకోవడానికే టైం సరిపోవడం లేదట. దాంతో ఉదయ బాను బయటకు రావడం కూడా మానేసింది.
{loadmodule mod_custom,GA1}
అయితే పిల్లలకు ఇప్పుడు 10 నెలలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. దీంతో కొంచెం టైం దొరుకుతుందట. దీంతో బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలు చేయాలని భావిస్తున్నారట. మరో రెండు నెలలో వారి ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ చేసి.. అదే టైంలో కమ్ బ్యాక్ అనబోతున్నారు. ఇప్పటిఏ స్టార్ మా, జెమిని టీవీలు ఉదయ భానును అప్రోచ్ అయ్యారంట. అయితే కొన్ని కండీషన్స్ పెట్టారంట.
{loadmodule mod_custom,GA2}
ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని.. గేమ్ షోలు, వల్గారిటీ ఉన్న వాటిని చేయనని ఖరాఖండిగా చెప్పేసిందంట. స్క్రిఫ్ట్ కూడా మంచిగా ఉండాలని, పిచ్చిపిచ్చి పంచ్ లు వద్దని సుతిమెత్తగా తన అభిప్రాయాన్ని చెప్పారంట. మొత్తానికి మరో రెండు నెలల్లో ఉదయభాను మళ్లీ బుల్లితెరపై హల్ చల్ చేయబోతున్నారన్నమాట.
{youtube}cSo2kCdw8E8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related