టాప్ హీరోల సరసన జత కట్టి… స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మలయాళీ నటి ఊర్వశి. ఈ మధ్య సైజ్ జీరో , మోహన్ లాల్ నటించిన మనమంతా సినిమాలో నటించి అలరించింది. నటన పరంగానే కాకుండా వివాదాస్పద వార్తల్లో కూడా ఈమె పేరుపొందిందే.
అయితే రీసెంట్ గా ఈమె చేస్తున్న ఓ షోలో తాగొచ్చి గొడవ చేసిందనే వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమె లేటెస్ట్ గా కైరాలి అనే ఛానల్ లో జీవితం ..సాక్షి అనే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం పై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.
ఊర్వశి చేసే కార్యక్రమంలో తమ కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తున్నారని, తన భార్య కుటుంబంలోని సమస్యలను, ఊర్వశి ఆధ్వర్యంలో టివి షో లో బయటపెట్టి ఆమె పబ్లిసిటీ చేసుకుంటున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ షో వల్ల తాము చాలా అవమానానికి గురయ్యామని, తమ కుటుంబం రోడ్డుపై పడిందని, తాము బయట తిరగలేక పోతున్నామంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ షోకి వచ్చిన వారిని ఊర్వశి కోపం ప్రదర్శిస్తూ బూతులు తిడుతుందని వారు కంప్లైంట్ లో తెలిపారు. అంతేకాకుండా ఒక్కోసారి బాగా తాగొచ్చి నానా హంగామా చేస్తుందని వారు పిర్యాదు పేర్కొనన్నారు.
Related