డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసిన ఓ సంచలనమే. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఓ చిత్రం తీస్తున్నాడు. గతంలో అమితాబ్ బచ్చన్ తో సర్కార్ సినిమాతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన వర్మ ఇప్పుడు అమితాబ్ తో మరో సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 90శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే వర్మ, పరిటాల రవీంద్ర హత్య జీవితం ఆధారంగా రక్త చరిత్ర సినిమాని తీసాడు. అలాగే ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వర్మ తన దగ్గర 12 మంది రచయితలతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో ఉన్న సినియర్ క్రైమ్ జర్నలిస్ట్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వారి దగ్గర నుంచి నయీంకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాడట. సో త్వరలోనే వర్మ డైరెక్షన్లో నయీం పై సినిమా ఉండబోతుందనమాట.
Related