- Advertisement -
తొలిప్రేమ సినిమాలో బాలు.. బాలు అంటూ ముద్దుముద్దుగా మాట్లాడి కుర్రాళ్లని కవ్వించిన హీరోయిన్ కీర్తిరెడ్డి హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పట్టుమని రెండేళ్లు కూడా తిరగకుండానే వారిద్దరూ విడిపోయారు.
అందుకు రకరకాల కారణాలు చెబుతుంటారు సినీ ఇండస్ట్రీవారు. సుమంత్ కి సంబంధించిన ప్రతి విషయంలోనూ వాళ్ల అక్క సుప్రియ జోక్యం ఎక్కువగా ఉంటుందట. కీర్తి రెడ్డి ప్రముఖ రాజకీయవేత్త అయిన గంగిరెడ్డి మనవరాలు కావడంతో అతి గారాబంగా పెరిగింది. తన భర్త విషయంలో ఆడపడుచు పెత్తనం భరించలేని కీర్తి రెడ్డి విడిపోవడం బెటర్ అని అనుకుందట.
దీంతో 2008లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె 2014లో లండన్ సెటిలైన్ ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా సుమంత్ మాత్రం ఇంకా ఒంటరివాడిగానే ఉండిపోయాడు.
Related