- Advertisement -
విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. జికె వీధి మండలం కుంకుంపూడి గ్రామానికి చెందిన గుండూరావు అనే వ్యక్తిని అర్ధరాత్రి హతమార్చారు.
పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
