- Advertisement -
ఆంధ్రప్రదేశ్కు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్నారు. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో వైవీ సుబ్బారెడ్డికి వైద్య సేవలందిస్తున్నారు.
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. విజయమ్మతో పాటు ఎమ్మెల్యే రోజా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.