సీరియల్స్ ప్రభావం పెద్దలపైనే కాకుండా పిల్లలపై పడుతోంది.అందులో వస్తున్న సన్నివేశాలను రియల్గా అనుకరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. టీవీ సీరియల్లో సూసైడ్ సీన్ చూస్తూ.. దాన్ని అనుకరించే క్రమంలో 11 పాప ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. సీరియల్లో మాదిరి ఉరి వేసుకొని చనిపోయింది.
వివరాల్లోకి వెల్తే…. బెంగులూరులోని మల్లెసంద్ర ప్రాంతంలో రంగే గౌడ భార్యతో కలిసి రోడ్డు పక్కన గోబీ మంచూరియా అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అమ్మ, తమ్ముడితో కలిసి నాన్న గోబీ మంచూరియా విక్రయించే చోటుకి వెళ్లిన పూజ రాత్రి ఏడు గంటల సమయంలో భోజనం చేయడానికి ఒంటరిగా ఇంటికొచ్చింది. 8 గంటల సమయంలో పాప సీరియల్ చూస్తున్నట్లు పక్కింటి వాల్లు తెలిపారు.రాత్రి 9.30 గంటలకు తల్లిదండ్రులు తిరిగి వచ్చే సరికి పూజ వాల్ హ్యాంగర్కు వేలాడుతూ కనిపించింది. దీంతో కంగారుపడిన వారు వెంటనే చిన్నారిని హాస్పిటల్కు తరలించారు. కాని అప్పటికే పాప మృతి చెందింది. పాప మరణం వెనుక ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. సీరియల్ చూస్తూ.. అందులోని సన్నివేశాలను అనుకరించే క్రమంలో పాప ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు.