Sunday, May 19, 2024
- Advertisement -

ఆ దారుణానికి నేటికీ 19 ఏళ్లు పూర్తి..!

- Advertisement -

పార్లమెంట్​పై దాడి జరిగి నేటితో 19ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆనాటి దుర్ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్​పై దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్​ చేశారు.

పార్లమెంట్​పై​ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వారి ధైర్యసాహసాలను భవిష్యత్తు తరాలు సైతం కీర్తిస్తాయని ట్వీట్​ చేశారు. పార్లమెంట్​ను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బంది శౌర్యానికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు.

2001 డిసెంబర్​ 13న సాయుధ ఇస్లామిక్​ ఉగ్రవాదులు భారత పార్లమెంట్​పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు దిల్లీ పోలీసులు, ఒక సీఆర్​పీఎఫ్​ మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్​ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -