- Advertisement -

మోదీ తప్పులకు..ప్రజలు మూల్యం?

- Advertisement -

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 మేర పెరగడంపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.

ప్రధాని మోదీ చేసిన తప్పులకు దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ ధరల పెంపు అదనపు భారమని పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ధరలను అదుపులో ఉంచి, ఓట్లు వేయించుకున్నాక ప్రజల జేబులకు చిల్లు పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల సాకుతో సామాన్యులను దోచుకుంటున్నారని, ఇది ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ గాంధీ విమర్శించారు.

ప్రభుత్వం తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, సామాన్యులకు ఊరటనివ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -