కొద్ది నెలలుగా కంటిపై కునుకులేకుండా చేస్తోన్న కరోనా కారణంగా.. అయినవారి అంత్యక్రియలకే హాజరుకాలేకపోతున్నారు చాలామంది. అయితే.. పాక్లో ఇటీవలే కన్నుమూసిన ‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్థాన్(టీఎల్పీ)’ పార్టీ చీఫ్ అల్లామా ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ అంతిమసంస్కారాలకు మాత్రం ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. టీఎల్పీ కార్యకర్తలు సహా.. 2లక్షలకుపైగా ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారు. లాహోర్లోని మినార్-ఇ-పాకిస్థాన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫలితంగా మసీదుకు వెళ్లే రోడ్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
2015లో ఆగస్టు 1న టీఎల్పీ పార్టీని స్థాపించిన రిజ్వీ.. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినందున బుధవారం ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం పరిస్థితి విషమించడం వల్ల.. మరొక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడికి చేరుకునేలోగానే ఆయన తుదిశ్వాస విడిచారని టీఎల్పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
పాకిస్థాన్ గగనతలంలో గుండె పోటు.. విమానం అత్యవసర ల్యాండింగ్