Friday, May 3, 2024
- Advertisement -

పాకిస్థాన్​ గగనతలంలో గుండె పోటు.. విమానం అత్యవసర ల్యాండింగ్​

- Advertisement -

ఎగురుతున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావటం వల్ల అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. అనతరం అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఢిల్లీకి చెందిన గోఎయిర్​ ‘జీ8-6658ఏ’ విమానం 179 మంది ప్రయాణికులతో రియాద్​ నుంచి ఢిల్లీకి మంగళవారం బయలుదేరింది. ఈ క్రమంలో పాకిస్థాన్​ గగనతలంలో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రాగా అవసరమైన వైద్య సాయం అందించారు.

అతడు స్పృహ కోల్పోవడం వల్ల కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేశారు. సదరు ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.మృతుడ్ని ఉత్తర్​ప్రదేశ్​ బరేలీకి చెందిన ముహమ్మద్​ నౌషద్​గా గుర్తించారు. మృతదేహాన్ని పాకిస్థాన్​ వైద్యులు పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్..!

నరమేధం.. 34 మంది మృతి..!

మాన్యువల్​ మెరినోకు వ్యతిరేకం.. హింసాత్మకం..!

అల్​ ఖైదా-2 మర్ గయా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -