- Advertisement -
ఎగురుతున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావటం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనతరం అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఢిల్లీకి చెందిన గోఎయిర్ ‘జీ8-6658ఏ’ విమానం 179 మంది ప్రయాణికులతో రియాద్ నుంచి ఢిల్లీకి మంగళవారం బయలుదేరింది. ఈ క్రమంలో పాకిస్థాన్ గగనతలంలో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రాగా అవసరమైన వైద్య సాయం అందించారు.
అతడు స్పృహ కోల్పోవడం వల్ల కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సదరు ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.మృతుడ్ని ఉత్తర్ప్రదేశ్ బరేలీకి చెందిన ముహమ్మద్ నౌషద్గా గుర్తించారు. మృతదేహాన్ని పాకిస్థాన్ వైద్యులు పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్..!