Friday, April 26, 2024
- Advertisement -

ముస్లిమేతర కుటుంబంలో పుట్టి..ఇస్లామిక్ స్టడీస్​లో టాప్..!

- Advertisement -

ఆ యువకుడు పుట్టింది ముస్లిమేతర కుటుంబంలో. కానీ ఇస్లామిక్ స్టడీస్​లో పీజీ చేయాలనుకున్నాడు. అదే అరుదనుకుంటే ఆ కోర్సు కోసం రాసిన ప్రవేశ పరీక్షల్లో 73.25 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడే రాజస్థాన్​కు చెందిన శుభం యాదవ్​. 21ఏళ్ల యాదవ్​కు ఇస్లాం బోధనలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి.

అందుకోసం కశ్మీర్​లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం సెప్టంబరులో పరీక్ష రాశాడు. అక్టోబరు 29న విడుదలైన ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించి ప్రత్యేకత చాటాడు. ఆ యూనివర్సటీలో 2015లో ఇస్లామిక్​ స్టడీస్​ సెంటర్​ను ప్రారంభించగా, ఇప్పటివరకూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన తొలి ముస్లిమేతర అభ్యర్థి యాదవే అని వర్సీటీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో డిగ్రీ చేసిన యాదవ్​… ఇస్లామిక్​ స్టడీస్​ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. “ఇస్లాం మతం హింసను ప్రేరేపిస్తుందని సమాజంలో అపోహ ఉంది. మత విద్వేసాలు పెరుగుతున్న నేటి కాలంలో ఇతరుల మతాలను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం” అని యాదవ్​ చెప్పారు. తాను భవిష్యత్​లో సివిల్స్ సర్వీసు​లో చేరాలనుకుంటున్నట్లు తెలిపాడు యాదవ్​.

గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -