Tuesday, May 21, 2024
- Advertisement -

40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!

- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కేశాడు!

మూడున్నరేళ్ల వయసు నుంచి సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు.  తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటినుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే మెట్లమార్గం ఎక్కేశాడు. తన పుట్టిన రోజైన ఆగస్టు 13వ తేదీ బుధవారం ఈ ఫీట్ సాధించడం విశేషం. మంచి వయసులో ఉన్నవాళ్లయితే రెండు నుంచి రెండున్నర గంటలు, కాస్త వయసు మీద పడినవాళ్లయితే నాలుగు గంటల్లో తిరుమల కొండ ఎక్కడం సర్వ సాధారణం. అలాంటిది ఒక్క గంట కూడా సమయం తీసుకోకుండానే ఈ బుడతడు కొండ ఎక్కేయడంతో ఇదంతా స్వామివారి మహత్యమేనని అక్కడి భక్తులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -