Monday, May 13, 2024
- Advertisement -

వామ్మో.. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం పోటీలో 40 మంది..!

- Advertisement -

ఏదో ప్రతిష్టాత్మక ఎన్నికల సమయంలో ఒక్క నియోజకవర్గంలోనే ఎక్కువమంది బరిలో దిగే పరిణామాలను గమనిస్తూ ఉంటాం. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల్లో రకరకాల సమీకరణాల ఆధారంగా అనేక మంది పోటీకి దిగుతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది.

అయితే ఈ ఇది అంత ప్రతిష్టాత్మకం కాకపోయినా.. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికలో ఒక పార్టీ తరపునే ఏకంగా 40 మంది ఒక్క సీటు కోసం పోటీ పడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ కోటాలో.. శాసనమండలి సభ్యుల ఎన్నికకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కోటాలో ఒక సీటు ఉంటుంది. మొత్తం ఆరు సీట్లలో బలాబలాలను బట్టి కాంగ్రెస్ కు ఒక సీటు లభిస్తుంది. మరి ఈ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన పోటీ ఉంది. ఒక లెక్క ప్రకారం చూస్తే ఏకంగా 40 మంది నేతలు ఈ సీటు కోసం పోటీలో ఉన్నారు.

 ఇది తమకు దక్కాలంటే తమకు దక్కాలి అంటూ ఈ నేతలు వాదులాడుకొంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది నేతలు నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకొన్నారు. అలాంటి వారికి ఇలాంటి అవకాశం కనిపించే సరికి ఎవరి లాబీయింగ్ వారుచేసుకొంటున్నారు. ఎలాగైనా పార్టీ తరపున తామే అభ్యర్థులం కావాలని వారు ప్రయత్నిస్తున్నారు. మరి వారిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఈ 40 మందిలో ఎవరికి శాసనమండలి సభ్యత్వం దక్కుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -