Friday, May 3, 2024
- Advertisement -

భార్య‌ను న‌మ్మించి.. క‌డతేర్చిన క‌సాయి భ‌ర్త‌..!

- Advertisement -

స‌మాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు రోజురోజుకు మాన‌వ బంధాల‌ను బ‌లహీనం చేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా డ‌బ్బు కోసం ఎంత‌టి దారుణం చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. సొంత కుటుంబంలోని వారి ప్రాణాల‌ను సైతం తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ద‌రుణానికి ఒడిగ‌ట్టాడు ఓ భ‌ర్త‌. ఇన్సూరెన్స్ డ‌బ్బుల కోసం ఏకంగా క‌ట్టుకున్న భార్య‌నే క‌డ‌తేర్చాడు ఆ క‌సాయి భ‌ర్త‌. అది కూడా ఆమె రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయింద‌నే విధంగా అంద‌రిని న‌మ్మించేలా రోడ్డు ప్ర‌మాదం చేయించి ఆమె ప్రాణాలు తీయించాడు.

ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో చోటుచేసుకుంది. బనస్‌కాంతా జిల్లాకు చెందిన లలిత్ సీఏగా పనిచేసేవాడు. భార్య దక్ష్ బెన్ పేరున లలిత్ 60 లక్షలు ఇన్సురెన్స్ చేయించాడు. తన భార్యను చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఆ 60 లక్షలు పొందొచ్చన్న దారుణ‌మైన ప్రణాళిక‌ను సిద్దం చేసి.. ఓ లారీ డ్రైవ‌ర్‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చి ఆ మ‌హిళ ప్రాణాలు తీసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే ఉద‌యాన్నే భార్య‌ను గుడికి తీసుకెళ్తున్న‌ట్టు న‌టించి… ఆమె వెంట తీసుకుని వెళ్లిన ల‌లిత్‌..రోడ్డు ప‌క్క‌గా వెళ్తూ.. డీల్ కుదుర్చుకున్న లారీ ద‌గ్గ‌ర‌కు రాగానే తాను ప‌క్క‌కు జ‌రిగాడు. ఈ క్ర‌మంలోనే ఆమెను లారీతో ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. అంద‌రూ ప్ర‌మాద‌మే అనుకున్నారు..కానీ పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి ద‌ర్యాప్తు లోతుగా చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ఈ నీచున్ని ఏం చేయాలి? కన్నకూతురు పై ఏడేళ్లుగా అత్యాచారం!

కన్న కొడుకును కర్కశంగా హతమార్చిన తండ్రి!

గోవాలో శ్రీముఖి అందాల ఆర‌బోత.. మాములుగా లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -