నేరం చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. సాధారణంగా రైలు మన పక్క నుంచి వెళ్తుంటే ఆ వేగానికి ముచ్చెమటలు పడుతుంటాయి… అందుకే కదిలే రైలు సమీపంలోకి ఎవరూ వెళ్లరు. అలాంటిది కొంత మంది ప్రమాద వశాత్తు రైలు క్రింద పడుతుంటారు.. ఇలాంటి సంఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో మనం చూశాం.
అలాంటిదే మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం దాదర్ లో జరిగింది. కాకపోతే ఇక్కడ ఓ లేడీ ఖైదా కావాలనే అటుగా వస్తున్న లోకల్ ట్రైన్ ముందు దూకి అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబయి ప్రాంతం దాదర్ లో ఓ లోకల్ ట్రైన్ వస్తుంది. అదే సమయానికి ఓ మహిళా కానిస్టేబుల్ మహిళా ఖైదిని తీసుకు వస్తుంది.
ఆమె ముందు పోలీస్ రక్షణగా వెళ్తున్నారు. ఏమైందో కానీ మహిళా ఖైదీ లేడీ కానిస్టేబుల్ చేయి విదిలించుకొని అటుగా వస్తున్న లోకల్ ట్రైన్ ముందు దూకింది. వెంటనే తేరుకున్న పురుష పోలీస్ ఆమె వెంటనే దూకి రక్షించాడు. ట్రైన్ కూడా టక్కున ఆగిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమైంది.
Watch: ‘వైయస్ జగన్ అనే నేను..’ సంక్షేమ సంతకానికి రెండేళ్లు