Sunday, May 5, 2024
- Advertisement -

దారుణం.. పండ్లు అమ్ముకునే మహిళపై యాసిడ్ దాడి..!

- Advertisement -

కర్ణాటక బెళగావి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పండ్లు అమ్ముకునే ఓ మహిళపై దుండగుడు యాసిడ్​ దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది ఆ మహిళ.

జిల్లాలోని రాయబాగ పట్టణం ఝండ కట్టె గ్రామంలో పండ్లు విక్రయిస్తూ జీవినం సాగిస్తోంది యాస్మీన్​ తహసీస్దార్​ (35). రోజుమాదిరిగానే పండ్లు అమ్ముకుంటుండగా అక్కడికి చేరుకున్న దుండగుడు ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ పొట్ట, మెడ బాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నీటిని చల్లి.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే.. యాసిడ్​ దాడికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దుండగుడి కోసం గాలింపు చేపట్టారు రాయబాగ పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -