Saturday, May 18, 2024
- Advertisement -

నాన‌మ్మ‌గురించి మంచుమ‌నోజ్ భావోద్వేగ ట్వీట్‌..

- Advertisement -

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు కుటుంబం లక్ష్మమ్మ మరణ వార్త వినగానే తిరిగి ఇండియాకు బయల్దేరింది. శుక్రవారం తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సోషియ‌ల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే మంచు మ‌నోజ్ తన నానమ్మ మరణ వార్తను ధ్రువీకరించారు. ‘మా నానమ్మ లక్ష్మమ్మ గారు ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. నిన్ను మిస్సవుతున్నాం నాన్నమ్మ. ఇప్పుడు మేం ఇండియాలో లేకపోవడం తీవ్రంగా బాధిస్తోంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాం. తన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంచో మనోజ్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -