ఎన్టీఆర్ కుమారుడు, మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తెలుగు దేశం పార్టీలోనూ, సినీ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితుడి పెళ్లికి నెల్లూరు వెల్తుండగా నార్కట్ పల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
ఆయన మరణ వార్త విని టీడీపీ ముఖ్య నాయకులు షాక్కు గుర్యారు. అందరూ హైదరాబాద్లోని హరికృష్ణనివాసానికి చేరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఇద్దరూ హరికృష్న భౌతిక కాయం వెంటే ఉన్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, పార్టీ నాయకులు ఆళ్లగడ్డలో ఉండాల్సిఉంది.
ఈ రోజు ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరుగుతోందన్న సంగతి తెలిసిందే. వివాహాన్ని భారీ ఎత్తున నిర్వహించేదుకు ఏర్పాట్లు చేశారు. హరికృష్ణ హఠాత్మరణంతో అఖిల పెళ్లి సందడి కళ తప్పింది. అఖిలప్రియ వివాహానికి వెళ్లాలనుకున్న నేతలు.. ఇప్పటికే వెళ్లిన వారంతా హుటాహుటిన హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రత్యేక హెలీకాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. అఖిలప్రియ పెళ్లికి ముఖ్య అతిథులు వీళ్లే. వీరితో పాటు నేతలంతా ఇప్పుడు హైదరాబాద్ దారి పట్టారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ పెళ్లిలో నేతల సందడి కనిపించడం లేదు.