రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలోసినీనటుడు రవితేజ సోదరుడు భరత్ మృతిచెందారు. శనివారం రాత్రి శంషాబాద్ మండలం కొత్వాలగూడ సమీపంలో ఔటర్ రింగ్రోడ్పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భరత్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. భరత్ రాజు మృతిపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.
{loadmodule mod_custom,GA1}
ఒంటరిగా మాదాపూర్ లో నివసిస్తున్న భరత్ పార్టీ అని చెప్పి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి జరిగిన తరువాత రింగ్ రోడ్ లో భరత్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొన్నట్లు తెలుస్తోంది.కానీ ప్రమాద వార్త ఆయన కుటుంబసభ్యులు ఎవరికీ వెంటనే తెలియలేదు. ఉదయానికి కానీ రవితేజ కుటుంబ సభ్యులకు వార్త చేరలేదని తెలుస్తోంది. భార్య అమెరికాలో వుంటున్నారు. పిల్లలు లేరు.
{loadmodule mod_custom,GA2}
నియంత్రిత వేగానికన్నా అధిక వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. సోదరుడి మృతితో రవితేజకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.
Also read
- ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?
- రాజ్ తరుణ్ పరిస్థితి తెలుసుకొని కంటతడి పెట్టిన రాజా రవీంద్ర
- వందసంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటెఇవి తినండి……
- 15 ఏళ్లలోపే నుంచే మందు తాగుతున్నారా..?