బాలీవుడ్లో ఒకప్పటి నటి జీనత్ అమన్ ప్రస్తుతం బయటకు వచ్చారు. తనకు ఎదురైన సమస్యను పరిష్కరించాలని, తనను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారవేత్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. రేప్ చేయడమే కాకుండా కొద్ది రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తనకు అసభ్యకర ఫొటోలు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదులో తెలిపింది.
ఇదే విషయమై కొన్ని నెలల కిందట జీనత్ ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. అయితే అందులో తనపై అత్యాచారానికి పాల్పడిన విషయాలేవీ తెలపలేదు. ఇప్పుడు అదే కేసులో తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జీనత్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
జీనత్ ఎవరంటే బాలీవుడ్లో సత్యం శివం సుందరం, కుర్బానీ, అజ్నబీ తదితర సినిమాలు చేశారు. మనకు అంతగా తెలియదులే!