టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ తేజ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.భర్త మరణంతో సురేఖ వాణి శోకసంద్రంలో మునిగిపోయారు.
సురేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్గా పనిచేస్తున్నారు. మా’టాకీస్, మొగుడ్స్ పెళ్లామ్స్, హార్ట్ బీట్ వంటి టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించింది సురేశ్ తేజనే. అప్పట్లో సురేఖ బుల్లితెర యాంకర్ గా పనిచేశారు. అదే సమయంలో సురేష్ తేజతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సురేఖా వాణి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది.