త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్షన్లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోగా తనీష్ నటించగా.. హీరోయిన్ గా నీతి టేలరే నటించింది. ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో నీతి నటన అద్భుతమని చెప్పాలి. ముస్లిం అమ్మాయిగా ఎంతో సహజంగా నటించింది.
ఈ సినిమా తర్వాత ‘పెళ్లి పుస్తకం’ అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా ప్లాప్ అయింది. దాంతో మళ్లీ ఈ బ్యూటీ సినిమా చేయలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె ఇటీవల ఆగష్ట్ 13న పెళ్లి చేసుకుంది. అంటే ఈ హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. నీతి టేలర్ తన స్నేహితుడు పరీక్షిత్ భవను వివాహం చేసుకుందట.
ఇప్పుడు తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగినట్లు తెలిపింది. ‘ఇప్పుడు నేను హేయ్ హజ్బెండ్ అని గట్టిగా అరవగలను’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!
అరియానాను అవినాష్ ముద్దు పెట్టుకున్నాడని.. చెంప పగలగొట్టిన అఖిల్..!