నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తి విషయం ఇప్పుడు రాజకీయాలలో మరో సారి హీట్ను పెంచేస్తున్నాయి.ఇన్నాల్లు సైలెంట్గా ఉన్న వ్యవహారం ఇప్పుడు తెరమీదకు వచ్చింది.అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో మునిగి తేలుతున్నారు.పోటీకి సౌఅంటె సై అన్న పార్టీలు ఇప్పుడు ఏకగ్రీవంవైపు చూస్తున్నాయి.
ఏ అనుభవం లేని అఖిలప్రియే చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇక సొంత పార్టీలోనే వ్యతిరేకంగా ఉన్న శిల్పా వర్గానికి చెక్ పెట్టిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆ శాసనసభ సీటుకు ఎన్నిక జరగనుంది.అధికార …విపక్షాల మధ్య పోటీ కంటె సొంత పార్టీలోనే టికెట్కోసం తీవ్ర పోటీ నెలకొంది. భూమా అఖిప్రియ కుంటుంబానికి సీటు రాకుండా … తెలుగుదేశం పార్టీ టికెట్ తనకు కావాలంటూ శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని మహిరంగంగానే ప్రకటించారు.దాంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు.
{loadmodule mod_custom,GA1}
చంద్రబాబు నాయుడు భూమా,అఖిల ప్రియ వర్గాలను రాజీచేయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఇక ఏంచేయాలో తెలయక చంద్రబాబు కాస్త పక్కన పెట్టారు. ఇక శిల్పా వర్గానికి ఇస్తే జగన్ తమ పార్టీనుంచి అభ్యర్తిని నిలబెడ్తానని ఖరాకండీగా చెప్పాడు.ఇక్కడే అఖిలప్రియ చక్రం తిప్పడంతో పాటు రాజకీయ చతురుతను ప్రదర్శించారు.
భూమా బ్రహ్మానందరెడ్డి స్వయానా అఖిలప్రియకు సోదరుడు.అంతేకాదు అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయాన అల్లుడు. దీంతో భూమా అఖిలప్రియ ఆయన ద్వారా మంత్రాంగం నడిపారు. భూమా బ్రహ్మానంద రెడ్డిని ఏకగ్రీవం చేసే వి,యంపై కాటసాని రామిరెడ్డి జగన్ తల్లి విజయమ్మతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దానికి విజయమ్మ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై జగన్తో కూడా మాట్లాడి ఏ విషయమూ త్వరలో చెప్తానని వైయస్ విజయమ్మ చెప్పినట్లు సమాచారం.
{loadmodule mod_custom,GA2}
ఇప్పుడు ఇది నంద్యాల రాజకీయాల్లో సంచలనంగా మారింది.భామా కుటుంబానికి టికెట్టు దక్కుండా చేయాలని చేస్తున్న శిల్పా వర్గానికి ఇది పెద్దషాకేనని చెప్పవచ్చు. బాబుతో ఎన్నిసార్లు మాట్లాడినా పలితం కనిపంచకపోవడంతో చివరిగా ఏకగ్రీవ అస్త్రాన్ని ప్రయేగించి శిల్పాకు అఖిల ప్రియ చెక్ పెట్టిందనే చెప్పాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related