బాబుకు తలనొప్పిగా మారిన నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఉత్కంఠకు తెరపడింది. ఇన్నాల్లు భామా కుంటంబానికే వస్తుందని అశలు పెట్టుకున్న అఖలప్రియ బాబు మొండిచేయి చూపారు. మా అమ్మ శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజున నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరో ప్రకటిస్తాం.. ఖచ్చితంగా మా కుటుంబానికే ఆ టిక్కెట్ దక్కుతుంది..
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి హామీ వచ్చిం దని చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసందే. అయితే ఇప్పుడు ఆమె స్వరంలో మార్పు కనిపిస్తోంది. అధిష్టాననిదే తుది నిర్నయమని ప్రకటించారు.దీంతో అమె మాటల్లోనే టికెట్పై మొండిచేయి చూపించారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజే ఉప టికెట్ అభ్యర్తిని ప్రకటిస్తామని సెలవిచ్చింది. అయితే అఖిలప్రియ మాట మారిపోయింది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘అల్టిమేటం’ పుణ్యమా అని, అఖిలప్రియ మాట తప్పాల్సి వచ్చింది. నంద్యాల టీడీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని సెలవిచ్చారామె. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని అఖిలప్రియ సెలవిచ్చారు. రెండు మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక విషయమై చంద్రబాబుతో భేటీ అవుతామని చెప్పారామె.
అసలు కథ భూమా నాగిరెడ్డి మరణం తర్వాతే ప్రారంభమయ్యింది. నంద్యాల టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ శిల్పా మోహన్రెడ్డి తెగేసి చెబుతున్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారతామనే హెచ్చరికలూ పంపేశారు. ఆ హెచ్చరికలకి చంద్రబాబూ తలొగ్గారు. ‘మంత్రి పదవి ఇచ్చాం కదా.. నంద్యాల టిక్కెట్ అడగొద్దు..’ అని ఆల్రెడీ చంద్రబాబు, అఖిలప్రియకి అల్టిమేటం జారీ చేసేశారు. కానీ, పైకి మాత్రం అఖిలప్రియ బుకాయించేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు.
అయితే చంద్రబాబు ఇంకా డిసైడ్ చేయకుండానే అఖిల ప్రియ ఇంతగా తానే నిర్ణయిస్తుండడంతో చివరకి ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అఖిలకు మంత్రి పదవి ఇవ్వడంతో నంద్యాల టిక్కెట్ ఇతరులకు ఇస్తారా లేదంటే అఖిల కుటుంబసభ్యులకే ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.జరుగుతున్న పరిణిమాలను చూస్తే అఖిలప్రియకు బాబు జులక్ ఇచ్చాడనేది స్పష్టంగా కనిపిస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related