స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ కు తెలుగు నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తనదైన నటనతో, డాన్సులతో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బన్ని. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విదేశాల్లో సైతం ఆయన సినిమాలకు మస్తు క్రేజ్ ఉంటుంది.
ఇక ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తు ల జాబితాలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు అల్లు అర్జున్ చోటు సంపాదించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ సత్తా ఎంటో మరో సారి నిరూపించాడు. సోషల్ మీడియాలోనూ బన్ని ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉంటుంది. ఆయన సినిమా విడుదల అవుతుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.
స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు కేరళ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగానే ఉంటుంది. తాజాగా అక్కడి పోలీసులు చేసిన పని బన్నికి ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో నిరూపించింది. అదే.. ప్రజల రక్షణే ధ్యేయంగా కేరళ పోలీసులు ఓ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలోని ఓ వీడియోను ట్వీట్ చేశారు. కేరళ స్టార్ అనేక మంది ఉన్నప్పటికీ.. బన్ని వీడియోను తీసుకోవడంపట్ల ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉపశమనం పొందండి !
పవన్, రాజమౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండదు !
పెట్రోల్ లీటర్ కు ఒక్క రూపాయేనట!