- పర్యావరణవేత్తకు ట్రాక్టర్, ఎక్సావేటర్ బహుమతి
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్వచ్ఛ భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పర్యావరణ వేత్త ఆఫ్రోజ్ షాకు ఓ బహుమతి అందించారు. ముంబయిలోని వెర్సోవా సముద్ర తీరాన్ని (బీచ్) శుభ్రం చేసేందుకు ఆయన సహకారం అందించారు. ఆఫ్రోజ్కు ట్రాక్టర్, ఎక్సావేటర్ బహుమతిగా ఇచ్చారు.
ఆఫ్రోజ్ చేసే పనికి మెచ్చి తానే కానుకగా ట్రాక్టర్, ఎక్సావేటర్ అందించినట్లు అమితాబ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరానికి చేరుకొని ఆఫ్రోజ్కు మిషన్లు అందించిన ఫొటోలను అమితాబ్ సోషల్ మీడియాలో విడుదలు చేశారు. ఓ మంచి పని కోసం బహుమతి ఇచ్చానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పని చాలా సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. బిగ్ బీ తమతో చేయి కలిపినందుకు ఎంతో సంతోషంగా ఉందని అఫ్రోజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రెండు వాహనాల ఇంజిన్స్ను ప్రారంభించినట్లు తెలిపారు.