Friday, April 26, 2024
- Advertisement -

కరోనా నకిలీ మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -

కరోనా వేళ ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పేరు మారు మోగిపోయింది. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో ఆ మందు పంపిణీ కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే ఆనందయ్య పేరు మీద కొందరు నకిలీ మందు కూడా తయారుచేస్తున్నారు. ఆనందయ్య మందు కరోనా కు బాగా పనిచేస్తుందని ప్రచారం సాగడంతో ఆయన మందుకోసం ప్రజలు భారీగా ఎగబడ్డారు. దీంతో కొంతకాలం ఏపీ సర్కారు మందు పంపిణీని ఆపేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో ఈ మందు పంపిణీ కొనసాగింది.

కళ్లల్లో వేసుకొనే చుక్కల మందు మినహా.. ఆనందయ్య తయారుచేసిన నాలుగు రకాల మందుల పంపిణీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మందును పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేల చొరవతో మందు పంపిణీ కొనసాగింది.

ఇటీవల ఆనందయ్య నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లారులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కొందరు నా పేరు మీద నకిలీ మందు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని నకిలీ మందు పంపిణీని అరికట్టాలి. ఇప్పటికే అనేక జిల్లాల్లో మందు పంపిణీ కొనసాగుతున్నది’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read

చిరుత వర్సెస్​ కుందేలు.. మధ్యలో అడవిపంది.. ఈ సీన్​ మామూలుగా లేదు..!

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

కళ్లముందే పులి ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపేసింది? అతను పరిస్థితి ఏంటంటే ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -