ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా థర్డ్వేవ్ విషయంలో ఆందోళన నెలకొన్నది. కొందరు నిపుణులు థర్డ్వేవ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కీలక ప్రకటన చేసింది. థర్డ్వేవ్ విషయంలో దేశప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు జోరుగా యాత్రలు, పర్యటనలు చేస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీనిపై ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజలు యాత్రలకు వెళ్లడం.. పుణ్యక్షేత్రాలకు వెళ్లడంతో కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఐఎంఏ పేర్కొన్నది. ఇటువంటి వ్యక్తులు సూపర్ స్పైడర్లుగా మారి కరోనాను మరింత వ్యాపించేలా చేస్తారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో పూరీ జగన్నాథ యాత్ర జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎంఏ ఆదేశాలు కీలకంగా మారాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని కూడా ఐఎంఏ సూచించింది. కరోనా థర్డ్వేవ్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలని ఐఎంఏ సూచించింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఉత్సవాలు, వేడుకులు సాగుతున్నాయి. ప్రజలు కూడా కరోనా విషయం మర్చిపోయారు.ఈ నేపథ్యంలో ఐఎంఏ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా చేపట్టాలని ఐఎంఏ కేంద్రానికి సూచనలు చేసింది.
Also Read
థర్డ్వేవ్ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!