తన మందు తయారీకి సహాయసహకారాలు అందించాలంటూ కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సీఎం జగన్కు లేఖ రాశారు. సోమవారం నుంచి కృష్ణపట్నంలో మందు పంపిణీ ప్రారంభమయిన విషయం తెలిసిందే. తొలుత డి కేవలం తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లికి మాత్రమే మందు పంపిణీ చేస్తున్నట్టు ఇప్పటికే ఆనందయ్య ప్రకటించారు.
ఇదిలా ఉంటే తన మందు తయారీకి సహకరించాలంటూ ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. ఇప్పటికే దాతల సాయంతో కొంత ముడి సరుకులు సమకూర్చుకున్నామని.. అయితే ప్రభుత్వం కూడా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన లేఖలో కోరారు. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో వలంటీర్ల సాయంతో ఇంటింటికి ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. నిన్న ఆనందయ్య తయారుచేసిన కే మందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్? ఇదిగో ఆన్సర్
మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. తన నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీ చేసేందుకు పూనుకున్నాడు. ఇందుకోసం ఆయన ముడి సరుకులను కూడా సమకూర్చాడు. ఆనందయ్య కుమారుడు చంద్రగిరి వెళ్లి.. అక్కడ మందును తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంపిణీ ప్రారంభమయ్యింది. మరోవైపు ఆనందయ్య మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు కృష్ణపట్నానికి తరలివస్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడ 144 సెక్షన్ విధించారు.