- Advertisement -
తుని లో జరిగిన కాపుగర్జన విధ్వంసానికి సంబందించి సిఐడి విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంభందించి సిఐడి వైసిపి నేత భూమనకరుణాకర్ రెడ్డి ని రెండు సార్లు సిఐడి విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంభందించి వివరాలను సిఐడి బయట పెట్టలేదు.
కాగా ఓ టివి ఛానల్ ఎండి అయిన సుధాకర్ నాయుడు ని కూడా సిఐడి విచారించింది.కాపుగర్జనకు ఆర్థిక సాయం హైదరాబాద్ నుంచే అందినట్లు సుధాకర్ నాయుడు విచారణ లో సిఐడి అధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.కాపు గర్జనకు ముందు హైదరాబాద్ లో ముద్రగడ తన మద్దత్తు కోరారని వెల్లడించారు. కాపు గర్జనలో వాడిన డ్రోన్ కెమెరాలను ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారని వెల్లడించారు.ఆ కెమెరాలకు ఎవరు సాయం చేసారో తనకు తెలియదని సుధాకర్ నాయుడు వెల్లడించినట్లు తెలుస్తోంది.