ఏపీ టీడీపీలో మరో వికెట్ డైన్.భూ అక్రమాల కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్రెడ్డిని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఈ రోజు ‘సమన్వయ కమిటీ’ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితులపై ఈ కమిటీ సమావేశంలో చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు.
హైద్రాబాద్లో వందల కోట్ల విలువైన భూముల కబ్జాకు దీపక్రెడ్డి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.బంజారాహిల్స్లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో , ఈ నేపథ్యంలోనే ఆయన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిన విషయాలే. పార్టీకి దీపక్రెడ్డి కారణంగా ‘చెడ్డపేరు’ వస్తుందన్న కోణంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
{loadmodule mod_custom,GA1}
దీపక్ రాజకీయ నేపధ్యం అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి మేనల్లుడు, తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడవ్వటమే. తన రాజకీయ నేపధ్యాన్ని అడ్డుపెట్టుకునే యధేచ్చగా భూక్బాలకు పాల్పడ్డారు.
ఎప్పుడూ నిప్పు అని చెప్పుకొనే బాబు అందరూ తనలాగా ఉండాలని కోరుకుంటాడు అందుకే ..అందుకే, నిప్పు’ కణికల్లా వుండాలన్నది చంద్రబాబు ఉవాచ. ఏంటీ, నిజమేననుకుంటున్నారా.? అదంతా హులక్కే.
బ్యాంకు రుణాలను ఎగొట్టిన నేరంపై సిబిఐ దాడులు జరగ్గానే నెల్లూరు ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.ఇప్పుడు దీపక్రెడ్డి విసయంలో ప్రతి పక్షాలనుంచి వస్తున్న విమర్శలను తట్టుకోలేక దీపక్రెడ్డిని సస్పెండ్ చేశారు.
{loadmodule mod_custom,GA2}
ఇంత వరకు బాగా నే ఉంది.విశాఖలో భూముల కుంభకోణంపై సాక్షాత్తూ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలొచ్చాయి. ఆరోపణలు చేసింది కూడా సహచర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయినాసరే, గంటా శ్రీనివాసరావుపై చర్యలుండవ్.
అంతెందుకు, సుపుత్రుడు – పైగా మంత్రి అయిన నారా లోకేష్పైనా కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనా, చంద్రబాబులాగానే ‘నిప్పు’. కాబట్టి, ఈ నిప్పు కణికలపై చర్యలుండవుగాక వుండవు. ఇది మన బాబుగారి నిప్పునీతి.
Related
- టీడీపీని వదిలేయడానికి సిద్దంగా ఉన్న జంప్ జిలానీలు
- శిల్పా …అఖిల మద్య మాటల యుద్ధం….
- నంద్యాల టీడీపీ ఖాలీ…. బాబు నాన్చుడు ధోరని కారనమా..?
- వలసతో ఆందోళనలో ఉన్న చంద్రబాబు ఆయన వర్గం…
{youtube}gls7OBB2s6E{/youtube}