Tuesday, April 16, 2024
- Advertisement -

శిల్పా …అఖిల మ‌ద్య‌ మాట‌ల యుద్ధం….

- Advertisement -
Bhuma Akhila Priya Vs Silpa Mohan Reddy

నంద్యాల ఉప ఎన్నిక రాజ‌కీయాల గంద‌గోలానికి తెర‌ప‌డింది.శిల్పామోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెల్ల‌డంతో భూమా వ‌ర్గానికి లైన్ క్లియ‌ర్ అయింది.టీడీపీ అభ్య‌ర్తిగా భూమా వ‌ర్గంనుంచే అబ్య‌ర్తి ఖ‌రాయిన‌ట్టే తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఇద్ద‌రి మ‌ద్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

శిల్పా వైసీపీ కండువా క‌ప్పుకున్న త‌ర్వాత అఖిల‌ప్రియ‌,చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.భూమా నాగిరెడ్డి టీడీపీలో చేర‌న‌త‌ర్వాత విబేధాలు తారాస్థాయికి చేరాయి. భూమా చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి ప ఇచ్చిన త‌ర్వాత ….కానీ వాళ్లు స్థానిక నేతలను అస్సలు పట్టించుకోలేదు. ఎంపీపీలు, జెడ్సీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు.. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఈ సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా సీఎం స్పందించలేద’’ని వివరించారు శిల్పా వివ‌రించారు.

{loadmodule mod_custom,GA1}

శిల్పా వ్యాఖ్య‌ల‌పై మంత్రి అఖిల ప్రియ ఘ‌టాగా స్పందించారు.మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని తాను ఇబ్బంది పెట్టానని అనడం హాస్యాస్పదమని మంత్రి అఖిల ప్రియ అన్నారు. నంద్యాలలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు అధికారులపై శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. శిల్పా టీడీపీ నుంచి వెళ్తే అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. ఇంత కాలం శిల్పా నంద్యాల అభివృద్ధికి ఉన్న అడ్డు తొలగిపోయిందని ఆమె అన్నారు.ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధిస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -