- Advertisement -
రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. వారికి సీఎం జగన్ పుస్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గవర్నర్ విశ్వభూషణ్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ నూతన గవర్నర్గా ఆయన బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ విశ్వభూషణ్తో గవర్నర్గా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.