Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్‌తో గంటకు పైగా జగన్ సమావేశం

- Advertisement -

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్. గత నెలలో తన ఫామ్ హౌస్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరుగగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో డాక్టర్లు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 15న నందినగర్‌లోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు కేసీఆర్.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ని పరామర్శించారు జగన్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక జగన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. జగన్ వెంట మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లారు.

కేసీఆర్ – జగన్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -