చుక్కల భూముల విషయంలో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. ఏపీ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ తిప్పి పంపారు. దీంతో ఏపీ సర్కార్కు గవర్నర్ కు మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ ల్యాండ్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపారు గవర్నర్.. 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అమ్ముకోకుండా ఈ ఆర్డినెన్స్ తయారు చేశారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్ల్లో ఒకటిని తిరస్కరించారు.
మరోవైపు దాటెడ్ ల్యాండ్ పై ప్రభుత్వ ఆర్డినెన్స్ ను గవర్నర్ నరసింహన్ తిప్పిపంపారు… దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం 2 నెలలు పెట్టడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది.