- Advertisement -
ఏపీ టిడిపి నేత కోడెల శివప్రసాద్ రావు, ఆయన కుమారుడు శివరామ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా విచారించని న్యాయస్థానం ముందస్తు బేయిల్ మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కోడెల ప్రసాదరావు కుటుంబ సభ్యులపై ఐదు కేసులు నమోదయ్యాయి. కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.