వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రపై సెటైర్లు వేవారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఏం సాదిద్దామని వంచన దీక్షలు చేస్తున్నారని మండి పడ్డారు.కేంద్రం, బీజేపీ వెనకేసుకురాడానికే దీక్షలు చేస్తున్నారా అని నిలదీశారు. దేశంలో వీక్లీ ఆఫ్ లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
కేంద్రానికి కొమ్ముకాయడానికే వైసీపీ వంచన దీక్షలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని వంచించింది జగన్మోహన్రెడ్డి కాదా అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చేసిన వారు టీడీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు
కడప జిల్లాలో అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. కడప ఉక్కఫ్యాక్టరీ విషయంలో కేంద్రం అన్యాయం చేసినా జగన్ ప్రశ్నించకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఏపీకి న్యాయం కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు కేంద్ర పెద్దల వద్ద లాలూచీ రాజకీయాలు చేయడం వంచనకాదా అని నిలదీశారు. . టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన యువనేస్తం పథకాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రానికి జగనే మోసం చేశారని ఆయన ఆరోపించారు.