- Advertisement -
రియో ఒలింపిక్స్ కు భారత సౌహార్ధ రాయబారిగా సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ ఎంపికయ్యారు. దీనికి తాను సిద్ధమేనంటూ ఆయన తన అంగీకారాన్ని కూడా తెలిపారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, షూటర్ అభినవ్ బింద్రా రియో ఒలింపిక్స్ కు రాయబారులుగా ఉండేందుకు ఇప్పటికే అంగీకరించారు.
ఇప్పుడు వారితో పాటు రెహమాన్ కూడా భారత రాయబారిగా తన అంగీకారాన్ని తెలిపారు. ఈ మేరకు రెహమాన్ నుంచి తమకు లేఖ అందిందని, ఇది తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది.
ఒలింపిక్ ఈవెంట్ ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, అథ్లెట్లకు మద్దతు తెలిపేందుకు భారత రాయబారులను నియమిస్తున్నామని, తమ వినతిని మన్నించినందుకు స్టార్లందరికి అభినందనాలు తెలియజేస్తున్నామని భారత ఒలింపిక్స్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు.