- Advertisement -
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కోర్టులో హాజరు కావాలంటూ గతంలో సమన్లు పంపారు.
అయితే ఆ ఆదేశాలను మంత్రి ఖాతరు చేయలేదు. దీంతో నాంపల్లి కోర్టు సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకాకుండా సహేతుకమైన కారణాలు చెప్పడం లేదంటూ మారిషస్ బ్యాంకు న్యాయవాది కనకమేడల శాతకర్ణి కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.