- Advertisement -
కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నేత కాటసాని రామ్ రెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.నాగార్జున రెడ్డి(28) ఈ రోజు(శుక్రవారం) ఉదయం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.నాగార్జునరెడ్డి ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఆయన ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నామని అన్నారు.నాగార్జునరెడ్డి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.