- Advertisement -
ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల దారుణ హత్యకు గురైన నాగరాజు.. కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వం నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు తల్లి, భార్య అశ్రిన్.. కన్నీరుమున్నీరయ్యారు.
తన కొడుకును హత్య చేసిన వారు బయటకొస్తే తాను చంపేస్తానంటూ నాగరాజు తల్లి ఉద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం నాగ రాజు కుటుంబాన్ని పరామర్శించారు.
నాగరాజు భార్య నలుగురు నిందితులు ఉన్నారని చెబుతుండగా.. పోలీసులు మాత్రం ఇద్దరే ఉన్నారంటున్నారని రాజా సింగ్ అన్నారు. నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. నాగరాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు.
దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు